భారత్ను ఎదుర్కోడానికి పాక్ సర్వసన్నద్ధమవుతోందట. పాక్ తన అణ్వాయుధాలను ఆధునీకరించడం, ఆయుధ సంపత్తిని మరింత విస్తరించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించిందని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఇదే యేడాది పాకిస్తాన్ సాయుధ శిక్షణను కూడా ప్రారంభిస్తుందని, అలాగే కొత్త డెలివరీ సిస్టమ్ను కూడా తయారు చేసే పనిలో పాక్ మునిగిపోయింది.
భారత్- పాక్ మధ్య సంబంధాలు సరిగ్గా లేవని, అందుకే పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరించుకోవడం, విస్తరించుకోవడం లాంటి ప్రయత్నాలు చేస్తోందని అమెరికా అధికారి ఓ సమావేశంలో మాట్లాడుతూ వెల్లడించారు. అణ్వాయుధాల పరంగా భారత్ పటిష్ఠంగా వుందని, అందుకే పాక్ తన ఉనికిని కాపాడుకోడానికి అణ్వాయుధాలు అత్యావశ్యకమని భావిస్తోంది.