వాషింగ్టన్, అక్టోబర్ 20: అల్జీమర్స్ వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించే కొత్త పద్ధతిని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కొత్త పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ(పీఈటీ) ఇమేజింగ్ టెక్నిక్ ద్వారా అల్జీమర్స్ ప్రారంభ సంకేతాల్లో ఒకదాన్ని గుర్తించవచ్చని, తద్వారా సకాలంలో వ్యాధికి తగిన చికిత్స తీసుకోవడంలో సాయపడతుందని తెలిపారు.
ఈ పీఈటీ స్కాన్లో 18ఎఫ్-ఎస్ఎంబీటీ-1 అనే రేడియో ట్రేజర్ అనే ఏజెంట్ ఉంటుంది. ఇది అధిక బీటా అమిలాయిడ్ ఉన్న వ్యక్తుల్లో అతిగా ఉండే మోనోఅమైన్ ఆక్సిడేస్-బీ(ఎంఏవో-బీ) అనే ఎంజైమ్ ఉనికిని గుర్తిస్తుందని వివరించారు. ఈ బీటా అమిలాయిడ్ అనేది అల్జీమర్స్ ప్రారంభ సంకేతాల్లో ఒకటి.