వాషింగ్టన్, సెప్టెంబర్ 27: భూమి నుంచి 1.07 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహశకలాన్ని నాసా వ్యోమనౌక విజయవంతంగా పేల్చేసింది. మంగళవారం తెల్లవారుజాము 4:44 నిమిషాలకు 14 వేల మైళ్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్.. డిమార్ఫస్ గ్రహశకలాన్ని తుత్తునియలు చేసింది. డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) పేరుతో నాసా చేపట్టిన ఈ మిషన్లో గ్రహశకలాన్ని పేల్చటానికి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్, లేజర్ కిరణాలను ఉపయోగించారు. ఈ ప్రయోగ ఫలితం మాత్రం 2 నెలల తర్వాతే తెలియనున్నది. అంతరిక్షంలో డిఫెన్స్ టెస్ట్ చేయటం ఇదే తొలిసారి.
ఈ ప్రయోగాన్ని ఎందుకు చేపట్టారు?
ఆస్టరాయిడ్స్ నుంచి మానవాళిని రక్షించడమే ఈ మిషన్ లక్ష్యం. డిమార్ఫస్ను 2003 నవంబర్ 20న భూమికి దగ్గరగా నాసా గుర్తించింది. ప్రమాదం ఉండే అవకాశం ఉన్నదని గ్రహించి పేల్చేవేసేందుకు గత నవంబర్లో డార్ట్ మిషన్ ప్రయోగించింది.