టాలీవుడ్ లో ఇపుడు అందరూ మాట్లాడుకుంటున్న సినిమా జాతిరత్నాలు. నవీన్పొలిశెట్టి-ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా అనుదీప్ కేవీ డైరెక్షన్లో వచ్చిన జాతిరత్నాలు ఫన్ ఎంటర్టైనర్ గా అందరికీ వినోదాన్ని పంచుతుంది. ప్రస్తుతం సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తోంది నవీన్ పొలిశెట్టి అండ్ టీం. సక్సెస్ ట్రిప్లో భాగంగా డైరెక్టర్ అండ్ టీం తిరుపతి ట్రిప్ వేసింది. తిరుపతి ఎయిర్పోర్టు లో నవీన్, ఫిరియా, అనుదీప్ ఇతర టీం మెంబర్స్ కనిపించగా అక్కడే కెమెరాలు క్లిక్ మనిపించాయి.
అయితే అనుదీప్ సాదాసీదాగా చెప్పులు లేకుండా కనిపిస్తుండటంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. చెప్పులు లేవా..? అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా..తిరుమలకు కాలినడకన వెళ్లేవాళ్లు చెప్పులు వేసుకోరు అంటూ మరో యూజర్ కామెంట్ పోస్ట్ చేశారు. ఎయిర్ పోర్టులో జాతిరత్నాలు టీం స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.