మాలే: మాల్దీవుల్లో దారుణ ఘటన జరిగింది. ఆ దేశ ప్రాసిక్యూటర్ జనరల్(Maldives Prosecutor General) హుస్సేన్ షమీమ్పై హత్యాయత్నం జరిగింది. కత్తితో అతన్ని కిరాతంగా పొడిచారు. మాజీ దేశాధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలి నేతృత్వంలోని ఎండీపీ పార్టీ హుస్సేన్ను నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాల్దీవుల్లో రాజకీయ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ చైనాకు అనుకూలంగా ఉన్నారు. దీంతో విపక్ష ఎండీపీ పార్టీ ఆయన్ను వ్యతిరేకిస్తున్నది. ముయిజూపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఆ పార్టీలో యోచిస్తున్నది.