లండన్ : బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నేతగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. దీంతో ఆమె ఆ దేశ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. వెస్ట్మినిస్టర్లోని కాన్ఫరెన్స్ సెంటర్లో ఇవాళ సర్ గ్రహం బ్రాడీ ప్రకటన చేశారు. కన్జర్వేటివ్ రేసులో లిజ్ ట్రస్కు 81,326 ఓట్లు పోలయ్యాయి. ఇక మన రిషి సునాక్కు 60,399 ఓట్లు పడ్డాయి. మొత్తం ఎలక్టరేట్ సంఖ్య 172,437. దీంట్లో 82.6 శాతం మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 654 బ్యాలెట్ పేపర్లను తిరస్కరించారు. బోరిస్ జాన్సన్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. కన్జర్వేటివ్ పార్టీలో పోటీ జరిగింది. అయితే రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య చివరి వరకు ఉత్కంఠ పోరు సాగింది. అనూహ్య రీతిలో రిషి సునాక్.. కన్జర్వేటివ్ నేత రేసులో ఓటమి పాలయ్యారు. విజయం సాధించిన లిజ్ ట్రస్ ఇప్పుడు ఆ దేశ ప్రధాని కానున్నారు.
గెలుపు తర్వాత క్వీన్ ఎలిజబెత్ సెంటర్ 2 ఆడిటోరియం నుంచి లిజ్ ట్రస్ ప్రసంగించారు. టోరీ నాయకత్వ రేసులో పాల్గొన్న నేతలందరికీ ఆమె థ్యాంక్స్ తెలిపారు. రిషి సునాక్కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ప్రచారం చాలా విరోచితంగా సాగినట్లు ఆమె వెల్లడించారు. పార్టీలో ఉన్న ట్యాలెంట్ బయటపడిందన్నారు. బ్రెగ్జిట్ సక్సెస్ అయ్యేలా పుతిన్కు అండగా నిలిచిన బోరిస్ జాన్సన్కు ఆమె థ్యాంక్స్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ అంశంలోనూ ఆమె బోరిస్ను మెచ్చుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. పన్నుల కోత విషయంలో సంచలన నిర్ణయాలు తప్పవని ఆమె తెలిపారు.
I am honoured to be elected Leader of the Conservative Party.
Thank you for putting your trust in me to lead and deliver for our great country.
I will take bold action to get all of us through these tough times, grow our economy, and unleash the United Kingdom’s potential. pic.twitter.com/xCGGTJzjqb
— Liz for Leader (@trussliz) September 5, 2022