ముంబై : మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వైద్యురాలిపై ఐటీ కమిషనర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడు. పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె అశ్లీల ఫొటోలు సోషల్ మీడియాలో పెడతారని బెదిరించాడు.
పుదుచ్చేరికి చెందిన నివాసి నేషనల్ అకాడమీ ఆఫ్ డెరెక్ట్ ట్యాక్సెస్లో శిక్షణ నిమిత్తం 2019లో నాగ్పూర్ వెళ్లాడు. ఈ క్రమంలో నాగ్పూర్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స నిమిత్తం వెళ్లగా అక్కడ పనిచేసే వైద్యురాలితో ఆయనకు పరిచయం ఏర్పడింది.
తాను యూపీఎస్పీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పడంతో వైద్యురాలికి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. తరువాత స్నేహం పెంచుకొని ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో గర్భవతి కాగా అబార్షన్ చేయించాడు. బాధితురాలు పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమె అశ్లీల ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.
దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ సెక్షన్ 376 (2) కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు బెంగళూర్లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతున్నది పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.