టెహ్రాన్: ఒక పైపు అమెరికా-ఇజ్రాయెల్తో తీవ్రమైన యుద్ధాన్ని ఎదుర్కొంటున్న వేళ.. ఇరాన్లో అధ్యక్షుడు పెజిష్కియన్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) చీఫ్ కమాండర్ అహ్మద్ వాహిది మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్టు ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. యుద్ధం పరిణామాలు, ప్రజల జీవితాలపై, ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని అధ్యక్షుడు ప్రస్తావిస్తూ యుద్ధ విరమణకు మొగ్గు చూపుతుండగా, ఐఆర్జీసీ చీఫ్ విభేదిస్తున్నారు. కాల్పుల విరమణ జరగకపోతే ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతాయని, మూడు వారాలు, లేదా నెల రోజుల్లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పెజిష్కియన్ హెచ్చరించారు. అలాగే కార్యనిర్వాహక, నిర్వహణ అధికారాలు పరిపాలనా యంత్రాంగానికి తిరిగి అప్పగించాలని పెజిష్కియన్ చేస్తున్న డిమాండ్ను అహ్మద్ తిరస్కరించడమే కాక, యుద్ధ సంక్షోభం రాకముందు దేశంలో నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో పాలనా యంత్రాంగం విఫలం కావడాన్ని ఎత్తిచూపుతున్నారు.