టొరంటో: భారతీయ విమానాలపై కెనడా ఆంక్షలను పొడిగించింది. ఆగస్టు 21వ తేదీ వరకు భారతదేశం నుంచి వస్తున్న విమానాలపై సస్పెన్షన్ విధించినట్లు కెనడా ప్రభుత్వం తాజాగా పేర్కొన్నది. కరోనా వైరస్ నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు అమలు అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న కారణంగా విమాన ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలను పొడిగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన ఇండియా, పాక్ నుంచి వెళ్లే విమానాలపై కెనడా బ్యాన్ విధించింది. ప్యాసింజర్, బిజినెస్ విమానాలను రద్దు చేశారు. అయితే ఆగస్టు నుంచి పూర్తిగా వ్యాక్సినేట్ అయిన వారికి అనుమతి కల్పించనున్నట్లు కెనడా చెప్పింది. ఈ సారి కెనడా ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల మందికి ఇమ్మిగ్రేషన్ వీసాలు ఇవ్వనున్నది. కోవిడ్తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.