Hanuman Shobhayatra | హైదరాబాద్ : ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి నేపథ్యంలో రేపు హైదరాబాద్ నగరంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ శోభాయాత్ర జరిగే మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడలోని రామమందిరం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమై.. తాడ్బండ్లోని హనుమాన్ మందిరం వరకు కొనసాగనుంది.
గౌలిగూడ, పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్కోఠి క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీ నగర్ బ్యాక్ సైడ్ వైశ్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్పేట రోడ్డు, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షోరూమ్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రామ్గోపాల్పేట్ రోడ్, పారడైజ్ క్రాస్ రోడ్స్, సీటీవో జంక్షన్, లీ రాయల్ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపిరీయల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ మీదుగా తాడ్బండ్లోని శ్రీ హనుమాన్ టెంపుల్ వద్దకు శోభాయాత్ర కొనసాగనుంది.
ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాక మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. లక్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్, ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారులు వీవీ స్టాచ్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్ ఫ్లై ఓవర్, ప్రకాశ్ నగర్ ఫ్లై ఓవర్, పారడైస్ ఫ్లై ఓవర్ మీదుగా సికింద్రాబాద్ స్టేషన్ చేరుకోవాలని సూచించారు.