మహానగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని చీల్చుకుంటూ వ్యూహాత్మక దారులు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. సిగ్నల్ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్ఆర్డీపీ) ప్రోగ్రాం ద్వారా చేపట్టిన నాగోల్ ఫ్లైఓవర్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వంతనెను బుధవారం ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్నారు. మొత్తం రూ. 143.58 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఫ్లైఓవర్తో వాహనదారులకు ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. 23 పిల్లర్లు, 22 స్పాన్స్తో నిర్మించిన ఈ వంతెనకు రెండు మార్గాలు 24 మీటర్ల వెడల్పు, 6 లేన్ల బై డైరెక్షన్ క్యారేజ్ వే చేపట్టారు. ఎస్ఆర్డీపీ ద్వారా ఇప్పటివరకు పూర్తయిన 31 పనులలో ఇది 16వ ఫ్లైఓవర్. ఇదిలా ఉంటే, డిసెంబర్ మొదటివారంలో ప్రారంభోత్సవం చేయడానికి కొత్తగూడ, శిల్పా లేఅవుట్లలో మరో రెండు ఫ్లైఓవర్లు సిద్ధమవుతుండడం విశేషం.

సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్, అక్టోబర్ 25 : సిగ్నల్ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (ఎస్ఆర్డీ) కార్యక్రమం ద్వారా చేపట్టిన నాగోల్ ఫె్లై ఓవర్ను రాష్ట్ర మున్సిపల్, పరిపాలన పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు (బుధవారం) ప్రారంభించనున్నారు. ఎస్ఆర్డీపీ పథకం ద్వారా ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ 41 పనులు, మిగతా 6 పనులు ఆయా శాఖలైన హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ, నేషనల్ హైవే ద్వారా మొత్తం 47 పనులు చేపట్టారు. ఎస్ఆర్డీపీ పథకం ద్వారా చేపట్టిన పనులు ఒకొకటి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం 47 పనులలో 31 పనులు పూర్తి కాగా మరో 16 ప నులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నట్లు అధికారులు పే ర్కొన్నారు. పూర్తయిన 31 పనులలో 15 ఫె్లై ఓవర్లు, 5 అండర్ పాసులు, 7 ఆర్ఓబిలు,ఆర్యుబిలు, ఒక కేబుల్ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, పంజాగుట్ట వైడెనింగ్, ఒకటి ఓఆర్ఆర్ నుండి మెదక్ రిహబిటేషన్ పనులు పూర్తయ్యాయని తెలిపారు.
రూ.143.58కోట్లతో నాగోల్ ఫ్లై ఓవర్..
యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ, ప్రాజెక్టుతో కలిపి మొత్తం రూ. 143.58 కోట్ల వ్యయంతో చేపట్టిన నాగోల్ ఫె్లై ఓవర్కు శ్రీకారం చుట్టారు. రెండు మార్గాలు ఈ ఫ్లై ఓవర్ 24 మీటర్ల వెడల్పు, 6 లేన్ల బై డైరెక్షన్ క్యారేజ్ వే చేపట్టారు. 23 పిల్లర్స్ 22 స్పాన్స్తో 600 మీటర్ల వయాడక్ట్ పొజిషన్, 300 మీటర్ల అప్రోచ్ పొడవుతో ఆర్ఈ వాల్ నిర్మాణం చేశారు. ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణాతో వాహన దారులకు అనేక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా కాలుష్యం తగ్గుదల, వాహన వేగం పెరిగి గమ్యస్థానానికి సకాలంలో చేరుతారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు అకడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులభతరం అవుతుంది.
మరో రెండు ఫ్లై ఓవర్లు త్వరలో ప్రారంభం..
మాదాపూర్, గచ్చిబౌలి, ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రెండు ఫె్లై ఓవర్లు నిర్మించారు. అందులో కొత్తగూడ ఫె్లై ఓవర్ కాగా మరొకటి శిల్పా లేఅవుట్ ఫె్లై ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి కావస్తున్నాయి. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. శిల్పాలేఅవుట్ ఫె్లై ఓవర్ బ్రిడ్జిని నవంబర్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్తగూడ ఫె్లై ఓవర్ పనులు త్వరలో పూర్తవుతాయి. డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభోత్సవం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
పరిశీలించిన అధికారులు..
నాగోలు ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ఏసీపీ శ్రీధర్రెడి, జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ మారుతీ దివాకర్తో పాటుగా వ్యూహాత్మర రోడ్డు అభివృద్ది కార్యక్రమం అధికారులు నాగోలు బ్రిడ్జిని సందర్శించారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడంతో ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు.