సిటీబ్యూరో, జులై 21 ( నమస్తే తెలంగాణ ): ఆత్మహత్యలను నివారించేందుకు ప్రధాన భూమికగా నగరంలోని బేగంపేటలో బుధవారం స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించామని సంస్థ ఫౌండర్ ఈదా శామ్యూ ల్ రెడ్డి తెలిపారు. సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఎనిమిది అంశాలతో కూడిన వెల్నెస్ కోర్సులతో విద్యార్థులకు చైతన్యం కల్పిస్తున్నామన్నారు. ఆత్మహత్య పరిష్కార మార్గాలను సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ చేయిస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్స్ రాష్ట్ర నాయకులు రాజేందర్, బుల్లితెర సీనియర్ నటుడు శివ, కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్, మాధవి, బ్యాంక్ మేనేజర్ జ్యోతిర్మయి, జగన్ నాయక్ భాస్కర్ తదితరులు పాల్గొన్నార