కాచిగూడ,జనవరి 11: గోల్నాక డివిజన్లోని కబేళా చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడంతో వాహనదారులు తమ ఇష్టానుసారంగా దూసుకుపోతున్నారు. ఈ చౌరస్తాలో ప్రతినిత్యం ట్రాఫిక్ జామ్తో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని ఇతర రోడ్లతో పోల్చితే కబేళా మార్గంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో సిగ్నల్స్ లేకపోవడంతో వాహనదారులు ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ఇబ్బంది కలిగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసు అధికారులు దృష్టి సారించి సిగ్నల్స్ను ఏర్పాటు చేసి ఇబ్బందులను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనుమాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.