ఆర్కేపురం, ఫిబ్రవరి 19: వినికిడి లోపం ఉన్న వారికి సేవ చేయడం గొప్ప విషయం అని ప్రముఖ కే.ఎస్.గాయని చిత్ర అన్నారు. ఆన్వీ హియరింగ్ సొల్యూషన్స్ 9వ వార్షికోత్సవం సందర్భంగా సిగ్నియా ఎక్స్క్లూజివ్ సెంటర్ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవ శరీరంలో ఏ భాగం ఇబ్బందులు తలెత్తినా ఏదో ఒక రూపంలో ప్రమాదం ఉంటుందన్నారు. ముఖ్యంగా వినికిడి లోపం ఉంటే మనం ఎవరితోనూ సరిగా మాట్లాడలేకుండా ఉంటామని, ఆ బాధ వర్ణనాతీతమన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ కేంద్రాలు అన్ని వయసుల వారికి వినికిడి పరికరాలను ఆప్టిమైజ్ చేయడానికి సరిపోయేలా సరికొత్త అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉన్నాయన్నారు.