హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక (SRDP) కింద నగరంలో ఫ్లై ఓవర్లను, అండర్ పాస్లను నిర్మిస్తూ ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అయితే ఎస్ఆర్డీపీ కింద ఆరాంఘర్ నుంచి నెహ్రూ జూ పార్క్ వరకు (4.5 కిలోమీటర్లు) ఫ్లై ఓవర్ను నిర్మిస్తున్నారు. ఇది హైదరాబాద్ నగరంలో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ అని అధికారులు తెలిపారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ కలిసి పరిశీలించారు. ఆరాంఘర్ – జూపార్క్ ఫ్లై ఓవర్ను 2023, మార్చి నెలలో ప్రారంభించనున్నారు. ఆరు లేన్లతో రూ. 636.80 కోట్లతో ఈ ఫ్లై ఓవర్ను నిర్మిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో అతిపెద్ద ఫ్లై ఓవర్గా పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఉంది. మెహిదీపట్నం సరోజినీ దేవీ కంటి ఆస్పత్రి నుంచి ఆరాంఘర్ వరకు ఉన్న పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పొడవు 11.6 కిలోమీటర్లు.