జియాగూడ/నందిగామ, జూన్ 10 : తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మే 28న జన్మించిన మగబిడ్డను రూ.1.70 లక్షలకు అక్రమంగా విక్రయించిన ఘటనపై కుల్సుంపురా పోలీస్స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కుల్సుంపురా ఇన్స్పెక్టర్ రాములు కథనం ప్రకారం… 18 ఏళ్లుగా సంతానం లేని మధుసూదన్, మీనా దంపతులు ఓ మగ బిడ్డ కోసం అన్వేషిస్తూ హైదరాబాద్ జియాగూడ వాసి పోతరాజు సురేష్ను సంప్రదించారు. సురేష్ మధ్యవర్తులైన పద్మ పాల్దియా భర్త గోపి పాల్దియాలు తక్కుగూడ ప్రైవేట్ ఆసుపత్రిలో మోహన్, సంధ్య దంపతులకు జన్మించిన మగ శిశువును విక్రయించేందుకు అంగీరించినట్లు విచారణలో వెల్లడైంది. మధ్యవర్తి సురేష్ సమక్షంలో తండ్రి మోహన్, సంధ్య దంపతులు కొత్తూర్ మండలం జేపీ దర్గా వద్ద బాలుడిని మధుసూదన్, మీనా దంపతులకు రూ.1.70 లక్షలకు విక్రయించారు.
కాగా దత్తతకు చట్టపరమైన విధానాలు పాటించాకుండా ఈ లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. ఘటన స్థలం నందిగామ పోలీస్స్టేసన్ పరిధిలోకి రావడంతో కేసును నందిగామ పోలీస్స్టేషన్కు బదిలీ చేసినట్లు తెలిపారు. బాలుడిని నగరంలోని శిశు విహార్కు తరలించి, కేసులో ఎవరెవరు ఉన్నారో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.