Rain Update | సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ, మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రుతుపవనాల ఆగమనంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి పడిపోయాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 30.1, కనిష్ఠం 22.9 డిగ్రీలు, గాలిలో తేమ 70 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.