సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న అక్రమార్కులపై రాచకొండ పోలీసులు తీసుకుంటున్న చర్యలపై మంత్రి నిరంజన్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి రఘునందన్రావు అభినందనలు తెలిపారు. సీపీ కమిషనర్ మహేశ్ భగవత్ తీసుకున్న చర్యలతో దాదాపు 10 మంది నకిలీ విత్తనాల సరఫరాదారులపై పీడీ యాక్ట్ విధించినట్లు వీడియో కాన్ఫరెన్స్లో ప్రశంసించారు. అదే విధంగా కొవిడ్-19 సమయంలో ప్రజలకు అవసరమైన విధంగా సేవలు అందించిన రాచకొండ పోలీసులకు గవర్నర్ గుర్తింపు లభించింది. ఈ మేరకు బుధవారం రాజ్భవన్కు రావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీపీ మహేశ్భగవత్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.