బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం 650 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం శనివారం తెల్లవారు జామున గ్రామాన్ని చుట్టు ముట్టిన పోలీసులు రైతులు చేపడుతున్న దీక్షను భగ్నం చేసి 650 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. రాత్రి 12 గంటల సమయంలో దీక్షలో ఉన్న రైతులను అరెస్టు చేసి మహేశ్వరం పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం వారిని తెల్లవారు జామున వదిలేసినట్లు గ్రామ రైతులు తెలిపారు.
కుమ్మరి నర్సింహకు పరామర్శ

బహదూర్పురలోజరిగిన ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతున్న కుమ్మరి నర్సింహను ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆమె వెంట కార్తిక్రెడ్డి, ప్రదీప్రెడ్డి, మంచర్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.