ఉప్పల్, ఆగస్టు 6 : తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏ ర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉప్పల్లోని పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ మేరకు పలు ఆలయాలను పరిశీలించి, బోనాల ఏర్పాట్లను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, డీఈ చందన, మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి, నర్సింహారెడ్డి, సల్ల వీరారెడ్డి, సల్ల రాజిరెడ్డి, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, వేముల సంతోష్రెడ్డి, మహంకాళి లక్ష్మణ్ పాల్గొన్నారు.
చిలుకానగర్ డివిజన్లో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. డివిజన్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, నర్సింహ, ఏదుల కొండల్రెడ్డి, జల్లి మోహన్, రాంరెడ్డి, బూర్గుల రమేశ్, కుమ్మరి గౌరయ్య, సత్తయ్య పాల్గొన్నారు.
ఉప్పల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఉప్పల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల సంతోష్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కలిశారు. ఈ మేరకు హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీమహంకాళి బో నాల జాతర మహోత్సవ ఆహ్వానపత్రికను అందజేశారు. కార్యక్రమంలో జయం ఫౌండేషన్ ప్రతినిధులు వేముల సంతోష్రెడ్డి, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, సుధాకర్, వెంకట్రెడ్డి, లక్ష్మీనారాయణ, వెంకట్రావు, సత్యపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి, ఆగస్టు 6 : అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని సీఐఏ కార్యాలయంలో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా వాసవి మిత్ర మండలి నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కలిసి సంక్షేమ కార్యక్రమాలు, సమస్యలను ఆయనకు వివరించారు. కార్యక్రమంలో వాసవి మిత్ర మండలి నాయకులు పెద్ది నాగరాజుగుప్తా, రెమిల్లి శ్రీనివాస్, గంప కృష్ణ, రామిణి తిరుమలేశ్, వంగునూర్ అశోక్, బెలిదే భగవాన్, మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి, నాయకులు కాసం మహిపాల్రెడ్డి, మణిపాల్రెడ్డి, బేతాల బాల్రాజు, సప్పిడి శ్రీనివాస్రెడ్డి, పద్మారెడ్డి, రెడ్డినాయక్, వంశీరాజు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
చర్లపల్లి, ఆగస్టు 6 : చర్లపల్లి డివిజన్ భరత్నగర్ రైల్వే క్రాసింగ్ ఆర్వోబీ బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరత గతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తెలిపారు. చర్లపల్లి భరత్నగర్ రైల్వే క్రాసింగ్ బ్రిడ్జి పనులను శుక్రవారం ఆయన పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరత్నగర్ రైల్వే క్రాసింగ్ పనులను వేగవంతం చేసేందుకు నిధులు కేటాయించామని, త్వరతగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, సప్పిడి శ్రీనివాస్రెడ్డి, ఎంపెల్లి పద్మారెడ్డి, వంశీరాజ్, రెడ్డినాయక్, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, సర్ఫ్రాజ్, దర్శనం కృష్ణ, శంకర్, డాక్టర్ సుభాశ్ పాల్గొన్నారు.
చర్లపల్లి, ఆగస్టు 6 : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అ న్నారు. చర్లపల్లి డివిజన్ భరత్నగర్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు కడియాల సురేశ్ తండ్రి నర్సింహ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ఎ మ్మెల్యే పరామర్శించారు. మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి, నాయకులు సప్పిడి శ్రీనివాస్రెడ్డి, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, రెడ్డినాయక్, వంశీరాజు పాల్గొన్నారు.