
సిటీబ్యూరో,ఆగస్టు30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేస్తున్న గోదావరి పథకంలోని మల్లారంలోని జలమండలి తాగునీటి శుద్ధి కేంద్రం పంప్హౌస్లోకి వరద నీరు చేరింది. దీంతో తొమ్మిది పంపులు నీట మునిగిపోయాయి. అప్రమత్తమైన అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం జలమండలి ఎండీ. దానకిశోర్తో కలిసి పంపుహౌస్ను సం దర్శించి పునరుద్ధరణ పనులను సమీక్షించారు. సిద్దిపేట చుట్టుపకల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు పంపుహౌస్లోకి వరద చేరడంతో ముందస్తు జాగ్రత్తగా పంపింగ్ ప్రక్రియను నిలిపివేసినట్టు మంత్రి తెలిపారు.
పంపుహౌస్ నుంచి నీటిని తోడి పునరుద్ధరణ పనులు చేపట్టినట్టు ఆయన చెప్పారు. సిద్దిపేట, మేడ్చ ల్, జనగామ, హైదరాబాద్ జిల్లాలో తా గునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి తిరిగి పంపింగ్ చేయడానికి మరో 36 నుంచి 48 గంట లు పడుతుందని, తాగునీటి సరఫరా ప్రభావిత ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నట్లు ఎండీ వెల్లడించారు.
గోదావరి పథకం ద్వారా ము ఖ్యంగా సరఫరా జరిగే శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, సైనిక్పురి, మలాజిగిరి, పటాన్చెరు, నిజాంపేట్, బాచుపల్లి తదితర ప్రాంతాల్ల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని, ఈ ప్రాంతాలకు సింగూ రు, మంజీరా, హిమాయత్సాగర్,ఉస్మాన్సాగర్ నుంచి అదనంగా నీటిని తరలించి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితు లు పునరావృతం కాకుండా పల్లెచెరువు నుంచి వచ్చే వరద నీటిని నిరోధించడానికి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సత్యనారాయణ, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, అధికారులు పాల్గొన్నారు.