కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవుతుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసు వేళల్లో మార్పులు చేశామని ఎల్ అండ్ టీ మెట్రో సీఈఓ, ఎం. డీ కె.వీ.బీ.రెడ్డి తెలిపారు. మే 12(గురువారం) నుంచి మెట్రో రైళ్లు ప్రతి రోజు ఉద యం 7.00 గంటలకు ఆయా ప్రారంభ మెట్రో స్టేషన్లలో మొదటి రైలు బయలు దేరుతుంది. ఆ తర్వాత మూడుకారిడార్లలో ఇరువైపులా మెట్రో రైళ్లు ఉదయం 9.45 వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. కాగా చివరి రైలు 8.45 గంటలకు ఒక మెట్రో స్టేషన్లో ప్రారంభమై, చివరి మెట్రో స్టేషన్కు 9.45కు చేరుకుంటుంది.
ఆ తర్వాత నుంచి మెట్రో రైలు సేవల ను నిలిపివేస్తామని, మళ్లీ మరుసటి రోజు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 9.45 గంటల వరకు మె ట్రో రైళ్లు మూడు కారిడార్లలో రాకపోకలు సాగిస్తాయని కె.వీ.బీ. రెడ్డి తెలిపారు. ఇలా 10 రోజుల పాటు మెట్రో వేళలు అమల్లో ఉం టాయని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభు త్వం లాక్డౌన్ విషయంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి మార్పులు ఉంటాయని ఆయన తెలిపారు. మెట్రోలో ప్రయాణం చేసే వారి భ ద్రత కోసం కొవిడ్-19 నిబంధన లు కచ్ఛితంగా పాటించేలా ఏర్పా ట్లు చేశామన్నారు. ప్రధానంగా మా స్కులు ధరించ డం, సామాజిక దూరం, తరచూ చేతులు కడుక్కోవడం, శానిటైజేషన్ చేసుకోవ డం, థర్మల్ స్క్రీ నింగ్ వంటి ని బంధనలను ప్ర యాణికులు పా టించాలన్నారు.