మాదాపూర్ : సరికొత్త ఆభరణాలు, ఆకట్టుకునే గృహోపకరణ ఉత్పత్తులు, సరికొత్త డిజైన్లతో కూడిన వస్ర్తాలు
ఒకే వేదికపై కొలువుదీరడంతో నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మంగళవారం ఏర్పాటు చేసిన హై లైఫ్ లగ్జరీ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటీమణులు స్రవంతి ప్రశాంత్, ఐశ్వర్య ఉల్లింగల, స్పందన పల్లిలు హజరై ప్రముఖ మోడల్స్, నిర్వాహకుడు డోమినిక్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.
మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో పలు ప్రాంతాల నుండి ప్రముఖ డిజైనర్ల చేతుల మీదుగా రూపొందించిన సరికొత్త వస్తు, ఉత్పత్తులు, వస్ర్తాభరణాలు, గృహోపకరణ ఉత్పత్తులు నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనంతరం నటి స్రవంతితో మోడల్స్ సెల్ఫీలు దిగుతు సందడి చేశారు.