సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): నగరం మళ్లీ వేడెక్కుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదవుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32.7డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 24.9డిగ్రీలు, గాలిలో తేమ 63శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.