గతేడాది ఆస్తి పన్ను లక్ష్యాలను పూర్తి చేయలేదు. దీంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది. బల్దియాకు ఆదాయం సమకూర్చేందుకు మన ముందున్న లక్ష్యం రూ.600 కోట్లు. నిర్ధేశించిన సమయంలో వసూళ్లు చేయాల్సిన బాధ్యత అధికారులదే’ అని జీహెచ్ఎంసీ కమిషన్ లోకేష్ కుమార్ అన్నారు. ఈ నెలలో ఆస్తి పన్నుల సేకరణలో జోన్ల వారీగా ఆయన లక్ష్యాలను ఖరారు చేశారు. ఆరు జోన్లకు గాను రూ.600 కోట్ల టార్గెట్ విధించారు. ఆస్తి పన్నుల బకాయిల సేకరణలో ఏ మాత్రం నిర్లక్ష్యం తగదని, అలసత్వం ప్రదర్శిస్తే జోనల్, డిప్యూటీ కమిషనర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. పన్నుల వసూళ్లలో ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్కలెక్టర్లు, ఏఎంసీలను పనితీరును పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా వారిదేనన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను శేరిలింగంపల్లి జోన్ మినహా మిగతా సర్కిళ్లు, జోన్లు పన్నుల సేకరణలో బాగానే పనిచేశాయన్నారు. ఈ నెలాఖరులోగా టార్గెట్ను చేరుకోకుంటే ఆ టీమ్ను మొత్తం చార్మినార్ జోన్కు పంపిస్తామని హెచ్చరించారు. ఆస్తి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, వారి సీనియార్టీని కోల్పోవడంతో పాటు భవిష్యత్లో జూనియర్లతో కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. అలసత్వం వహించే టీఐ, బీసీ, ఏఎంసీల జాబితాను తయారు చేయాలని కమిషనర్ ఆదేశించారు.