మొత్తం ఏడేండ్ల వ్యవధిలో రూ. 20, 611.6 కోట్ల ప్రాజెక్టులను చేపట్టి ప్రజలకు మెరుగైన నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకున్నది.తక్కువ సమయంలో ఎక్కువగా ఖర్చు చేయడం జలమండలి చరిత్రలోనే అరుదు అని, టీఆర్ఎస్ పాలనలో సంస్థ గణనీయంగా వృద్ధి సాధించిందని సినీయర్ ఇంజనీర్లు చెబుతుండడం గమనార్హం.
ఎన్ని కోట్లు ఖర్చైనా ఫర్యాలేదు.. ఒక్క రోజూ నీటి సమస్య ఉండవద్దు
రూ.10కోట్లు ఖర్చు అయినా ఫర్వాలేదు.. ఏ ఒక్క రోజు నగరానికి నీటి సమస్య ఉండొద్దు..ఎల్లంపల్లి రిజర్వాయర్ డేడ్స్టోరేజీ సమయంలో నగరానికి గోదావరి జలాల తరలింపు ప్రక్రియలో భాగంగా సీఎం కేసీఆర్ అన్న ఈ ఒక్క మాట చాలు.. నగర తాగునీటి సమస్య పరిష్కారంలో చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాలనే ప్రణాళికలతో ఉన్న ఆయన నీటి ఎద్దడి అనేది నగరాభివృద్ధికి ఏ మాత్రం ఆటంకంగా మారొద్దని నిరంతరం సీఎం కేసీఆర్ జలమండలి అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
నల్లా కనెక్షన్ లేని ఇంటి నుంచి రూపాయికే నల్లా కనెక్షన్..నెలకు 20 కిలో లీటర్ల ఉచిత నీటి పథకం వరకు ఒక సినీయర్ ఇంజనీర్గా మారి పాలనలో తనదైన ముద్ర వేశారు. అంతేకాకుండా దేశంలోని వివిధ మెట్రో పాలిటన్ నగరాలతో పోల్చితే హైదరాబాద్ మహానగరంలో జలమండలి సరఫరా చేస్తున్న తాగునీరు సురక్షితమైనదని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (జీఐఎస్) 10500 : 2012 నిబంధన ప్రకారం వరుసగా సర్టిఫికెట్స్ను ప్రధానం చేసింది.
మానవ వికాసానికి నీరు జీవనాధారం. నీరు లేకుండా ఎటువంటి అభివృద్ధిని కానీ, పురోగతిని ఊహించలేం. ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తెరిగింది. అందుకే నీటి వనరుల సంరక్షణపై ప్రత్యేక దృషి సారించింది. ఎంతో శ్రద్ధతో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలోని ప్రజలందరికీ నీటినందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. తాగునీటికి మొదటి ప్రాధాన్యతనిస్తూ.. సాగుతోపాటు పారిశ్రామిక రంగానికి తరువాతి స్థానాన్ని ఇచ్చాం.
ఈ క్రమంలో నగరవాసుల దాహార్తిని తీర్చడంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయి అండ్ సీవరేజీ బోరు (హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ) కీలకపాత్రను పోషిస్తున్నది. పెరుగుతున్న నీటి అవసరాలకు అనుగుణంగా నిర్వహణను చేపట్టింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రెండు లక్ష్యాలతో ముందుకు సాగుతున్నది. ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని తరలించి నగరవాసుల దాహార్తిని తీర్చడం. నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని 190 గ్రామాలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తున్నది. – ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ నగరంలో ఇప్పుడు తాగునీటి సమస్య లేదు.. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు నగరంలో నీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు జలమండలి ప్రణాళికలు రచించింది. ప్రస్తుత పరిస్థితులు, జనాభాకు తగ్గట్లుగానే భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని 30 ఏండ్ల ముందు చూపుతో నగరానికి నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచింది. భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు లేకుండా, మురుగునీటి సమస్యలు తలెత్తకుండా సివరేజీ మాస్టర్ప్లాన్ పనులు చకచకా జరుగుతున్నాయి.
సికింద్రాబాద్ దేవీనగర్కు చెందిన గాయత్రి అనే చిన్నారి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ను నీటి సమస్యను దృష్టికి తీసుకువచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో కేటీఆర్కు సదరు బాలిక వీడియోను ట్విట్ చేయగా, వెంటనే స్పందించిన కేటీఆర్ మరుసటి రోజు తెల్లవారేసరికి సమస్యను పరిష్కరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.
హుస్సేన్సాగర్ ద్వారా తాగునీటిని అందుకున్న చారిత్రక హైదరాబాద్ ఆపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుక్కెడు నీటి కోసం నదుల వెంట పరుగులు తీసిన దుస్థితి. జంట జలాశయాల ద్వారా దశాబ్దాల పాటు నగరవాసులు దాహార్తిని తీర్చుకోగా… ఉమ్మడి పాలకులు పెరుగుతున్న నీటి అవసరాల కోసం సింగూరును ఆశ్రయించారు. అదీ చాలకపోవడంతో కృష్ణా వెంట పరుగులు పెట్టారు. ఆ తర్వాత వందల కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను తరలించారు. ఖైరతాబాద్ జలమండలి కేంద్ర కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలు, కుండలతో ప్రతిపక్షాల నిరసన ప్రదర్శనలు, ధర్నాలు షరామామూలే. లాఠీచార్జీలు జరిగిన రోజులూ ఉన్నాయి. ఏదేని రోజు అనుకోని అవాంతరం ఎదురైతే హైదరాబాద్ గొంతు ఎండటం తప్ప ప్రత్యామ్నాయం లేదు.
తాగునీటి ప్రాజెక్టులు నిర్మించడమే కాదు… తరలించిన నీటిని సమర్థవంతంగా సరఫరా చేయడమనేది ముఖ్యం. తెలంగాణ ప్రభుత్వం చేసింది అదే. సీఎం కేసీఆర్ ముందుచూపు, ప్రణాళికలు ఇప్పుడు హైదరాబాద్ నగరానికి పుష్కలమైన తాగునీటిని అందిస్తున్నాయి. మొన్నటిదాకా రోజుకు 340 మిలియన్ గ్యాలన్లుగా ఉన్న నగర నీటి సరఫరా సామర్థ్యాన్ని ప్రస్తుతం రోజుకు 468 మిలియన్ గ్యాలన్లకు పెంచారు. అంతేకాదు… విశ్వనగరమైన హైదరాబాద్కు భవిష్యత్లో ఒక్కరోజు కూడా తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు కేశవాపూర్లో గోదావరి జలాల భారీ నిల్వ సామర్థ్యంతో డెడికేటెడ్ రిజర్వాయర్ను కూడా నిర్మిస్తున్నారు. పైగా కృష్ణాజలాల సరఫరాలోనూ సుంకిశాల పథకంతో వర్షాభావ పరిస్థితుల్లోనూ ఇబ్బందులు రాకుండా ముందుచూపు ప్రదర్శించారు. వెరసి… ఖాళీ బిందెల ప్రదర్శనలు పోయి ఉచితంగా నెలకు 20 వేల లీటర్ల సురక్షిత జలాలను అందుకునే స్థాయికి నగరవాసి చేరుకోవడం విశేషం.
కృష్ణా మూడు దశలు 273 ఎంజీడీలు
గోదావరి 167
ఉస్మాన్సాగర్ 18
హిమాయత్సాగర్ 10 468 ఎంజీడీలు
మిషన్ భగరథ కింద 50 ఎంజీడీలు, నగరంలో 418 ఎంజీడీలు తరలిస్తుండగా, 12 లక్షల మంది వినియోగదారులకు సమృద్దిగా నీటి సరఫరా చేస్తున్నారు.