హిమాయత్నగర్,ఏప్రిల్15 : కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం హిమాయత్నగర్లోని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి రెండున్నర ఏండ్లు గడిచిన్నప్పటికీ బీసీలకు ఇచ్చిన 21 హామీలలో ఏఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు.
జనాభా దామాషా ప్రకారం బీసీలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం బీసీలు ఐక్యతతో పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు.ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ,మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బాపురాజు పాల్గొన్నారు.