వ్యవసాయ యూనివర్సిటీ , ఆగస్టు 21: వ్యవసాయ యూనివర్సిటీ, కళాశాల సుదీర్ఘ ఫలితాల పరిశోధనవల్లే సాగులో విప్లవాత్మక మార్పులు సాధ్యమయ్యాయని ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ ఉపకులపతి డా. ప్రవీణ్రావు అన్నారు. శనివారం కళాశాల ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఆన్లైన్లో ఆయన మాట్లాడారు. గడిచిన కొన్నేండ్లుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలు, వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. పలు జాతీయ , అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తీర్ణంలో పరస్పర సహకారంతో పని చేస్తున్నామన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ను వ్యవసాయ రంగంలో అమలు జరిపేందుకు పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నామన్నారు. 1955 బ్యాచ్కు చెందిన జస్టిస్ వామనరావు తన కళాశాల రోజులను ,అనుభవాలను గుర్తు చేసుకున్నారు.వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ నరేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు,విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు పాల్గొని తమ అభిప్రాయాలను, గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.