వ్యవసాయ యూనివర్సిటీ , ఆగస్టు 22 : వయ్యారి భామ అనే కలుపు మొక్క పంటకు చాలా ప్రమాదకారి అని , తెలంగాణలో దీని ప్రభావం అధికంగా ఉందని భారతీయ నూనె గింజల సంస్థ (ఐఐవోఆర్) డైరెక్టర్ డాక్టర్ సుజాత అన్నారు. ఆదివారం వయ్యారి భామ కలుపు మొక్క (పార్థీనియం) పై అవగాహన సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ ఈ కలుపు మొక్క అన్ని నేలలో ఏపుగా పెరుగుతుందన్నారు. పంటలపైనే కాకుండా పశుజాతి, మానవుడిపై కూడా ప్రత్యక్ష, పరోక్షంగా హాని చేస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సాగు నీరు అధికంగా అందుబాటులోకి తీసుకు రావడంతో, పంటల సాగు గణనీయంగా పెరిగిందన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డా. సురేశ్కుమార్, డా. సతీశ్కుమార్, సుధాకర్ బాబు పాల్గొన్నారు.