సుల్తాన్బజార్ : జీవనోపాధి నిమిత్తం బీహార్ నుండి నగరానికి వచ్చిన ఓ మైనర్ బాలుడు(14)అదృశ్యమైన సంఘటన బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఎస్ఐ అనూష తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన 14 ఏళ్ళ బాలుడు గత ఆరు నెలల క్రితం జీవనోపాధి కోసం నగరానికి చేరుకొని ఎంజే మార్కెట్ చౌరస్తాలోని న్యూ పారడైజ్ హోటల్లో నివసిస్తూ ఆట వస్తువులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు.
ఇదిలా ఉండగా జనవరి 14న లాడ్జీ నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. కాగా బాలుని కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో గురువారం బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా సీనా బేకరీ మీదుగా రోడ్డు అవతలికి వెళ్ళి చార్మినార్ గుల్జార్ హౌజ్ కమాన్ వరకు ఆటోలో వెళ్ళిన బాలుడు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడో పరిశీలిస్తున్నట్లు ఆమె వివరించారు.కేసు దర్యాప్తులో ఉంది.