రంగారెడ్డి జిల్లా కోర్టులు,జనవరి 18 (నమస్తే తెలంగాణ): సాయం చేయడమే అతని పాలిట పాపమైంది. లారీలో ప్రయాణించడానికి అనుమతించిన పాపానికి డ్రైవర్పై హత్యాయత్నానికి పాల్పడి లారీతో సహ ఉడాంయిచిన నిందితుడు మహ్మద్ ఖైజర్ అలీఖాన్(30)కి పదేండ్ల జైలుశిక్ష, రెండువేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి నారాయణ తీర్పునిచ్చారు.
అదనపు పీపీ ఎం.గంగారెడ్డి కథనం ప్రకారం.. రామన్నపేట మండలం యెల్లంకి గ్రామానికి చెందిన మల్లేశ్ విశాఖపట్టణం నుంచి హైదరాబాద్కు తుక్కును తరలిస్తుండగా వనస్థలిపురానికి చెందిన నిందితుడు మహ్మద్ ఖైజర్ అలీఖాన్ తనను హైదరాబాద్ వరకు తమ లారీలో తీసుకెళ్లాలని కోరాడు. డ్రైవర్ మల్లేశ్ అతనితోపాటు లారీలో ఉన్న తండ్రి అవనగంటి సత్తయ్య సమ్మతించి లారీలోకి అనుమతించారు.
అయితే 2015 ఫిబ్రవరి 2న లారీ నడుపుతున్న మల్లేశ్కు నిద్ర రావడంతో నిందితుడు డ్రైవింగ్ చేస్తూ ఔటర్రింగ్ రోడ్కు చేరుకున్న తరువాత లారీ ఫంక్చర్ అయ్యిందని తెలుపడంతో సత్తయ్య కిందకు దిగాడు. దీంతో నిందితుడు లారీతో పరారయ్యాడు. మార్గమధ్యలో నిద్రలో ఉన్న మల్లేశ్పై దాడి చేసి ఔటర్ రింగ్ రోడ్పై పడేశాడు. దీంతో జరిగిన ఘటనపై పహడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి నిందితుడు మహ్మద్ ఖైజర్ అలీఖాన్ను అరెస్ట్ చేసి సాక్షాధారాలతో చార్జీషీటు దాఖలు చేశారు, సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు మహ్మద్ ఖైజర్ అలీఖాన్కు జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.