గవర్నర్ల చర్యలు రాష్ట్ర ప్రభుత్వాల పతనానికి కారణమైతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనని సుప్రీంకోర్టు ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో గతేడాది గవర్నర్ అసెంబ్లీలో వివాదాస్పద రీతిలో విశ్వాస పరీక్షకు ఆదేశించటం, ఆ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోవటాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది.
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో ఉద్ధ వ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన అతిపెద్ద పార్టీ. అయితే ఆ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు నాయకత్వంపై తిరుగుబా టు చేసి, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ విశ్వాస పరీక్షకు ఆదేశించారు. తన వర్గం మెజారిటీని కోల్పోయిందని గ్రహించిన ఉద్ధవ్ ఠాక్రే బల నిరూపణకు దిగకుండానే సీఎం పదవికి గతేడాది జూన్లో రాజీనామా చేశారు. ఇటీవల ఈ అంశానికి సంబంధించిన పలు పిటిషన్లను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనుంజయ చంద్రచూడ్. విశ్వాస పరీక్షకు సంబంధించి గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ పతనానికి దారితీసే విధంగా గవర్నర్ చర్యలు ఉండటాని కి ఎంతమాత్రం వీల్లేదన్నారు. ఇది మన ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యమైన అంశమని (వెరీ వెరీ సీరియస్), దాని ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు.
గవర్నర్లు బిల్లులపై సంతకాలు చేయడానికి నిరాకరిస్తున్నారని దక్షిణాది రాష్ట్రలైన కేరళ, తెలంగాణ ప్రభుత్వాలు ఎంతోకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ‘రాజ్యాంగ ప్రతిష్టంభన సృష్టిస్తున్నారని’ పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, కేరళలో వామపక్ష కూటమి అధికారంలో ఉన్నాయి. ఈ రెం డు రాష్ర్టాలతో పాటు మహారాష్ట్రలోనూ గవర్నర్లను ని యమించింది ఆయా పార్టీల ప్రత్యర్థి అయిన బీజేపీ కావడం గమనార్హం.
ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి నియమిం చే గవర్నర్లు రాష్ర్టాలకు రాజ్యంగ అధిపతులు. చాలావరకు వారి పాత్ర ఉత్సవమూర్తుల వం టిదైనప్పటికీ వారు కొన్ని శాసన, కార్యనిర్వా హక, విచక్షణాధికారాలను కలిగి ఉంటారు. రాజకీయ సంక్షోభాల సమయంలో వారి పాత్ర కీలకంగా మారుతుంది. ఉదాహరణకు, రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలతో ఏ పార్టీకీ మె జారిటీ దక్కకుండా అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీని పిలువాలన్నదానిపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా నిలిపివేయటం కూడా గవర్నర్ పరిధిలో ఉంటుంది. క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే గవర్నర్ను ‘ప్రజాస్వామ్య అంపైర్’గా భావించవచ్చు. గవర్నర్లు రాజకీయంగా పక్షపాత వైఖరితో ఉంటున్నారని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటారని వారిపై చాలాకాలంగా విమర్శ ఉన్నది. గవర్నర్ల నియామక ప్రక్రియ, వారి పదవీకాలంపై నెలకొని ఉండే అనిశ్చితి.. వీటి కారణంగానే రాజకీయంగా సున్నిత పరిస్థితులు నెలకొన్నప్పుడు గవర్నర్లు నిష్పక్షపాత అంపైర్ల మాదిరిగా కాకుండా కేంద్రప్రభుత్వ దూతలుగా వ్యవహరిస్తున్నారని ముకుల్ కేశవన్ అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డారు.
కేంద్రంలో అధికారాన్ని చేపట్టే ప్రభుత్వం తమకంటే ముందున్న ప్రభుత్వం నియమించిన గవర్నర్లను తొలగించి, కొత్తవారిని నియమిస్తూ ఈ అంశాన్ని మరింత రాజకీయం చేస్తున్నది. ఒక అధ్యయనంలో భాగంగా 1950-2015 మధ్యకాలంలో గవర్నర్లుగా ఉన్న వారి పదవీకాలన్నీ పరిశీలిస్తే, వారిలో మూడోవంతు మంది మాత్రమే తమ ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసినట్టు తేలింది. 37 శాతం మంది ఒక ఏడాది కంటే తక్కువకాలం పదవిలో ఉన్నట్టు వెల్లడైంది. సంప్రదాయాలను పక్కనబెడుతూ కేంద్ర ప్రభుత్వాలు తర చూ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే, ఏకపక్షంగా గవర్నర్లను నియమిస్తున్నాయి. ఈ ధోరణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీస్తున్నది.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టా ల్లో.. రాష్ట్ర ప్రభుత్వం పనితీరులో గవర్నర్లు జోక్యం చేసుకోవటం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. దేశంలోని అర డజనుకుపైగా రాష్ర్టాలకు గవర్నర్గా సుదీర్ఘ సేవలందించి 1980 లో పదవీ విరమణ పొందిన బీకే నెహ్రూ.. గవర్నర్ పదవిని ఈ విధంగా అభివర్ణించారు. ‘పాలక పార్టీలో పదవీ విరమణ చేసిన సభ్యుడికి విలాసవంతమైన రిటైర్మెంట్ జీవితాన్ని ఇచ్చేదే గవర్నర్ పదవి’.1950-2015 మధ్య కాలంలో పనిచేసిన గవర్నర్లపై ప్రొఫెసర్ అశోక్ పంకజ్ చేసిన అధ్యయనంలో పలు అంశాలు వెల్లడయ్యాయి. గవర్నర్లుగా నియమితులైన వారిలో 52 శాతం మంది రాజకీయ నాయకులు కాగా, 26 శాతం మంది ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు. మిగిలినవారిలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, డిఫెన్స్ అధికారులు, విద్యావేత్తలున్నారు. గవర్నర్ పదవి చేపట్టిన వారిలో ఐదోవంతు మంది మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలున్నారని తేలింది.
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిన సమ యం ఆసన్నమైందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. గవర్నర్ వ్యవస్థ అసహ్యకరమైనదని, దానిని రద్దు చేసినంత మాత్రాన ఏమీ జరుగదని ‘ది ప్రింట్’ ఎడిటర్ శేఖర్ గుప్తా అభిప్రాయపడ్డారు. అయితే, అది చెప్పినంత సులువు కాదు. ‘గవర్నర్ వ్యవస్థ ను రద్దుచేయటం చట్టపరంగా వీలుకాకపోతే, వారి పాత్రను కుదించటమే మెరుగైన ప్రత్యామ్నాయం’ అని కేశవన్ చెప్తున్నారు. ‘విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ’ అనే మేధోసంస్థ 21వ శతాబ్దానికి అనుగుణంగా రాష్ర్టాల గవర్నర్ వ్యవస్థను మార్చుకోవ టం అనే అంశంపై అధ్యయనం జరిపింది. దీని ప్రకారం… ఆ వ్యవస్థను పూర్తి గా తొలగించటం కంటే సంస్కరించటమే మేలు. గవర్నర్లను నియమించడం, తొలగించ డమనేది పాలక పక్షం విచక్షణాధికారంగా ఉం డకూడదని, అది మరింత సమాఖ్య, సహకార పద్ధతిలో జరగాలని ‘విధి’ అధ్యయనంలో పాల్గొన్న పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. తాను తీసుకున్న చర్యల వెనుక ఉన్న కారణాలను గవర్నర్ బహిరంగపరచాలని పేర్కొన్నారు. గవర్నర్ బాధ్యతలను కార్యనిర్వాహక వ్యవస్థకు గానీ, న్యాయవ్యవస్థకు గానీ అప్పగించటం వల్ల ఆ రెండు వ్యవస్థలను రాజకీయాల్లోకి తెచ్చినట్లవుతుందని రచయిత లలిత్ పాండా అభిప్రాయపడ్డారు. సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.‘సమస్య గవర్నర్ వ్యవస్థకు సంబంధించింది కాదు. ఆ పదవిని చేపట్టే కొందరి వల్ల ఉత్పన్నమవుతున్న సమస్య ఇది. కాబట్టి, వ్యవస్థనే రద్దు చేయాల్సిన అవసరం లేదు. వారి నియామకాల్లో మరింత పారదర్శకతను పాటించాలి. పక్షపాతపూరిత లక్ష్యాల సాధన కోసం వారిని ఉపయోగించుకోకుండా చూడాలి’ అని పేర్కొన్నారు.
కేంద్రంలో అధికారాన్ని చేపట్టే ప్రభుత్వం తమకంటే ముందున్న ప్రభుత్వం నియమించిన గవర్నర్లను తొలగించి, కొత్తవారిని నియమిస్తూ ఈ అంశాన్ని మరింత రాజకీయం చేస్తున్నది. ఒక అధ్యయనంలో భాగంగా 1950-2015 మధ్యకాలంలో గవర్నర్లుగా ఉన్న వారి పదవీకాలన్నీ పరిశీలిస్తే, వారిలో మూడోవం తు మంది మాత్రమే తమ ఐదేండ్ల పదవీ కా లాన్ని పూర్తి చేసినట్టు తేలింది. 37 శాతం మంది ఒక ఏడాది కంటే తక్కువకాలం పదవిలో ఉన్నట్టు వెల్లడైంది. సంప్రదాయాలను పక్కనబెడుతూ కేంద్రప్రభుత్వాలు తరచూ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే, ఏకపక్షం గా గవర్నర్లను నియమిస్తున్నాయి. ఈ ధోరణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీస్తున్నది.
– సౌతిక్ బిశ్వాస్
(బీబీసీ సౌజన్యంతో…)