జైపూర్ : రాజస్ధాన్లోని భరత్పూర్లో దారుణం వెలుగుచూసింది. 48 ఏండ్ల మహిళను తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు సమీప అటవీప్రాంతానికి వెళ్లిన బాధితురాలు తిరిగివస్తుండగా పొరుగింటి వ్యక్తి ఆమెను అడ్డగించి తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
నిందితుడిని ఉస్మాన్గా గుర్తించారు. మహిళ సాయం కోసం అరుస్తుండగా కుటుంబ సభ్యులు ఘటనా ప్రాంతానికి చేరుకునే సరికి నిందితుడు ఆమెను కొడుతుండటం గమనించారు. బాధితురాలికి తలపై గాయమైందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.