జైపూర్ : రాజస్దాన్లో దారుణం వెలుగుచూసింది. బావమరిది సాయంతో ధన్బాద్కు చెందిన ఇద్దరు బాలికలను జైపూర్కు రప్పించిన నిందితుడు పెండ్లి పేరుతో, చదివిస్తానని మభ్యపెడుతూ వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుడిని అర్మాన్, అతడి బావమరిదిని ఆరిఫ్లుగా గుర్తించారు.
ఇద్దరు కూతుళ్లు అదృశ్యం కావడంతో బాధితురాలి తల్లి ధన్బాద్లో ఏప్రిల్ 7న పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాళ్లలో ఒకరిని పెండ్లి చేసుకుంటానని మభ్యపెట్టిన నిందితుడు మరొకరిని చదివిస్తానని నమ్మబలుకుతూ ఆర్మాన్ వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దర్యాప్తులో భాగంగా బాలికలను జైపూర్కు తీసుకువెళ్లిన ఆరిఫ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏప్రిల్ 12న ఇద్దరు బాలికలు ధన్బాద్ చేరుకోగా వారిలో ఒకరిని తమ కుమారుడితో వివాహం జరిపించేందుకు నిందితుడు ఆర్మాన్ తల్లితండ్రులు అంగీకరించలేదు. తమను జైపూర్కు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఆర్మాన్ ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించాడని బాలికలు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు ఆర్మాన్ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.