కామారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడ్వాయి మండలం కృష్ణాజి వాడి వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన ఓ మహిళ మృతి చెందగా..మరో పదిహేను మంది గాయడ్డారు. స్థానికుల కథనం మేరకు.. సామగ్రితో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.