మంచాల : మంచాల తాసీల్దార్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి నాలా కన్వెన్షన్ కోసం ఇచ్చిన రూ. 7లక్షల కాజేసి వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాసీల్దార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామంలో రాఘవరావు అనే వ్యక్తి సుమారు రెండువందల ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఇందులో కొంతభాగాన్ని వ్యవసాయేతర భూమిగా మార్పించుకుని ప్లాట్లు చేయడానికి నిర్ణయించాడు.
అట్టి భూమిపై నాలా కట్టడం కోసం తాసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న భరత్ కుమార్(కంప్యూటర్ ఆపరేటర్) అనే వ్యక్తిని ఆశ్రయించాడు. దీంతో భరత్కుమార్ నాలా చలాన్ను చెల్లించి వ్యవసాయేతరహ భూమిగా మార్చి ఇస్తానని బాధితుడు రాఘవరావు నుంచి రూ. 7లక్షలు తీసుకున్నాడు. ఇట్టి డబ్బులను పూర్తిగా వాడుకుని నకిలీ చలానాను సృష్టించి రాఘవరావుకు ఇచ్చాడు. భరత్కుమార్ ఇచ్చిన చలాన్ను తీసుకుని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లగా అక్కడ అసలు విషయం బయటపడింది. అతను ఇచ్చిన చలాన నకిళిదిని తెలడంతో తాను మోసపోయానని గుర్తించి వెంటనే తాసీల్దార్ దృష్టికి తీసుకెల్లారు. ఈ విషయాన్ని గుర్తించి గోప్యంగా ఉంచడం కోసం భరత్కుమార్ కాజేసిన డబ్బులను రాఘవరావుకు తిరిగి ఇచ్చాడు. కాని జరిగిన మోసంపై తాసీల్దార్ భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు జరుగకుండా ఉండాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.