ముంబై ,జూన్ 24:కరోనా మహమ్మారి కష్టకాలంలో టాటా మోటార్స్ తమ వాహనాల కొనుగోలు సులభతరం చేసేందుకు సరికొత్త ఫైనాన్స్ పథకాలను ప్రవేశపెట్టింది. కంపెనీ ఇందుకోసం కోటాక్ మహీంద్రా తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా, రెడ్ కార్పెట్, ప్రైమ్ విశ్వాస్, వివిధ కస్టమర్ గ్రూపుల (జీతం, స్వయం ఉపాధి, ఆదాయ రుజువు) కోసం తక్కువ ఈఎమ్ఐలతో మూడురకాల ఫైనాన్స్ స్కీమ్స్ ప్రవేశపెట్టారు. పట్టణ ,గ్రామీణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ పథకాలను ప్రవేశపెట్టారు.
ఆదాయ ధృవీకరణ (ఇన్కమ్ ప్రూఫ్) వారికి మాత్రమే రెడ్ కార్పెట్ ఫైనాన్స్ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్లో భాగంగా, ఆన్-రోడ్ ధరపై 90 శాతం వరకూ ఫండింగ్ను అందిస్తున్నారు. ఇందులో 7 ఏండ్ల వరకు రుణ వ్యవధి ఉంటుంది. రుణం ప్రీ-పేమెంట్ లేదా పార్ట్-పేమెంట్లపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నారు. టాటా సఫారి, టాటా హారియర్, టాటా నెక్సాన్, టాటా ఆల్ట్రోజ్, టాటా టిగోర్ , టాటా టియాగో వంటి వాహనాలను ఈ రెడ్ కార్పెట్ స్కీమ్ కవర్ చేస్తుంది.ఇన్కమ్ ప్రూఫ్ లేని వినియోగదారుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా, వాహనం ఎక్స్-షోరూమ్ ధరలో వినియోగదారులకు 90 శాతం వరకూ ఫండింగ్,5ఏండ్ల వరకు రుణ వ్యవధి ఉంటుంది.
వ్యవసాయ భూమి లేదా ఆస్తి పత్రాల ఆధారంగా రుణం ఇస్తారు.ఈ పథకాన్ని ప్రత్యేకించి స్వయం ఉపాధి లేదా జీతానికి పనిచేసే వారిని దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టారు. ఇందులో వినియోగదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, మొదటి మూడు నెలల పాటు 50 శాతం వరకు తక్కువ ఈఎం ఐ ఆప్షన్ ఉంటుంది. అంటే,మొదటి 3నెలల పాటు ప్రతి లక్ష రూపాయలకు కనీస ఈఎంఐ రూ.999గా ఉంటుంది. అంతేకాకుండా,ఈ స్కీమ్లో భాగంగా కస్టమర్లకు ఆన్-రోడ్ ధరపై 80 శాతం వరకు ఫండింగ్ అందించనున్నారు.
ఈ కొత్త ఫైనాన్స్ పథకాలను పొందటానికి వినియోగదారులు టాటా మోటార్స్ డీలర్షిప్లను సందర్శించవచ్చు లేదా టాటా మోటార్స్ వాహనాలను కొనుగోలు చేయడానికి కోటక్ మహీంద్రా ప్రైమ్ బ్రాంచ్ను కూడా సంప్రదించవచ్చు. అంతే కాకుండా, ఈ పథకాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని కంపెనీ అధికారిక వెబ్సైట్లో పొందవచ్చు.టాటా నెక్సాన్పై కంపెనీ ఈ కేవలం రూ.15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్ను మాత్రమే అందిస్తోంది. ఇది కాకుండా, దీనిపై వేరే ఏ ఇతర ఆఫర్ లేదు. కాగా, టాటా హారియర్పై ఈ నెలలో కంపెనీ గరిష్టంగా రూ.65,000 వరకు లాభాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు మరియు రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్లు ఉన్నాయి.