మినప పప్పు: ఒక కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం: చిన్న ముక్క, కరివేపాకు తురుము: కొద్దిగా, జీలకర్ర: ఒక టీస్పూన్, వంట సోడా: పావు టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం
మినప పప్పుని బాగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. నానిన పప్పును నీళ్లు ఒంపి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో పప్పు మిశ్రమం, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, జీలకర్ర, కరివేపాకు, వంటసోడా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడయ్యాక పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరచేత్తో వడలు ఒత్తుకుని దోరగా కాల్చుకుంటే వేడివేడి మినప వడలు సిద్ధం.
పరమాన్నం
కావలసిన పదార్థాలు
బియ్యం: ఒక కప్పు, బెల్లం తురుము: ముప్పావు కప్పు, పాలు: రెండు కప్పులు, నెయ్యి: పావు కప్పు, డ్రైఫ్రూట్స్: పావు కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్
తయారీ విధానం
బియ్యాన్ని బాగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో అరకప్పు నీళ్లుపోసి బెల్లం వేసి కరిగేలా బాగా కలపాలి. స్టవ్మీద గిన్నెపెట్టి పాలు పోసి వేడయ్యాక బియ్యం వేసి బాగా ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికిన తర్వాత కరిగించిన బెల్లం, యాలకుల పొడి వేసి సన్నని మంటపై మరో అయిదు నిమిషాలు ఉడికించాలి. స్టవ్మీద పాన్పెట్టి నెయ్యి వేసి వేడయ్యాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి. వీటిని నెయ్యితోపాటు ఉడుకుతున్న అన్నంలో వేసి బాగా కలిపితే ఘుమఘుమలాడే బెల్లం పరమాన్నం సిద్ధం.
పూర్ణాలు
కావలసిన పదార్థాలు
పెసర పప్పు: ఒక కప్పు, బెల్లం: అర కప్పు, మినప పప్పు: పావు కప్పు, బియ్యం: అర కప్పు, యాలకుల పొడి: అర టీస్పూన్, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా, ఉప్పు: కొద్దిగా
తయారీ విధానం
మినప పప్పు, బియ్యాన్ని బాగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్మీద కుకర్ పెట్టి కడిగిన పెసర పప్పు వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లుపోసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఉడికిన పప్పులో బెల్లం, యాలకుల పొడి, నెయ్యి వేసి దగ్గరపడేవరకూ కలపాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచేయాలి. పప్పు మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. పిండి మిశ్రమంలో చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి పప్పు ఉండలను పిండిలో ముంచి, వేడైన నూనెలో వేసి సన్నని మంటపై దోరగా కాల్చుకుంటే పెసర పూర్ణాలు సిద్ధం.