Chiranjeevi | ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’లోని వినోదం, ‘హిట్లర్’లోని సెంటిమెంట్ రెండూ కలిస్తే ‘విశ్వంభర’. ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట ఇది. చిరంజీవి చాలాకాలం తర్వాత చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇది. ఊహలకందని కథ, కథనాలతో సృష్టి, స్థితి, లయ.. ఈ మూడింటి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని వినికిడి. ఓవైపు సమకాలీన సమాజంలో కథ నడుస్తూ.. మరోవైపు మానవాతీత శక్తులతో చిరంజీవి పోరాటాలు చేయడం ఇందులో కొత్తగా ఉండే అంశం అని సమాచారం. చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తున్నారు. ఇదిలావుంటే.. కథ రీత్యా ఇందులో చిరంజీవికి ముగ్గురు చెల్లెళ్లుంటారని తెలిసింది.
ఆ ముగ్గురిలో ఓ చెల్లెలిగా ‘నాని గ్యాంగ్లీడర్’ఫేం సురభి నటిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.70శాతం గ్రాఫిక్స్తో చిరంజీవి కెరీర్లోనే అంత్యంత భారీ బడ్జెట్ సినిమాగా యూవీ క్రియేషన్స్వారు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథ డిమాండ్ మేరకు 13 భారీ సెట్లను కూడా నిర్మిస్తున్నారట. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానున్న విషయం తెలిసిందే.