టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇద్దరికి అశేషమైన అభిమాన గణం ఉంది. వీరిద్దరు త్వరలో ఒక వేదికపై కలవబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. వార్త వైరల్ కావడంతో దీనిపై ఆరాలు తీసే ప్రయత్నంలో మునిగిపోయారు అభిమానులు.
దళపతి విజయ్ త్వరలో టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఇటీవల దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది.దిల రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా మరి కొద్ది రోజులలో పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు చీఫ్ గెస్ట్గా వస్తారనే టాక్ నడుస్తుంది.
వంశీ పైడిపల్లికి, మహేష్కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే విజయ్ సినిమా లాంచింగ్కు మహేష్ హాజరు కానున్నట్టు తెలుస్తుంది. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడు.ఇక విజయ్ ప్రస్తుతం బీస్ట్ అనే సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.