దక్షిణాది చిత్రసీమలో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్న అగ్ర కథానాయిక సమంత బాలీవుడ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఆమె నటించనున్న తొలి హిందీ చిత్రమేమిటన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఆదిత్యధర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్ హీరోగా నటించనున్న ‘ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ అశ్వత్థామ’ చిత్రంలో సమంత నాయికగా ఖరారైనట్లు తెలిసింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.. ఇందులో సమంత యాక్షన్ ప్రధానమైన పాత్రలో కనిపించనుందని సమాచారం. ఇదిలావుండగా ఆయుష్మాన్ ఖురానాతో కలిసి సమంత ఓ చిత్రంలో నటించబోతున్నదని వార్తలొచ్చాయి. కరణ్జోహర్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటించనున్న చిత్రంలో కూడా సమంత పేరు పరిశీలనలో ఉందని తెలిసింది. ‘ఫ్యామిలీమెన్-2’ వెబ్సిరీస్ ద్వారా సమంత బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన విషయం తెలిసిందే. దాంతో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ భామకు అవకాశాలివ్వడానికి ముందుకొస్తున్నాయని చెబుతున్నారు.