Virata Parvam Pre Release Event | ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజం నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు ‘నీది నాది ఒకే కథ’ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సినిమాపై రెట్టింపు అంచనాలను నమోదు చేసింది. ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్లను జరుపుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
విరాట పర్వం ప్రీ రిలీజ్ వేడుక త్వరలో జరుగునుంది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు గెస్ట్లుగా వెంకటేష్, రామ్చరణ్ తేజ్ రానున్నట్లు సమాచారం. లేటెస్ట్గానే చిత్రబృందం వరంగల్లో ఆత్మీయ వేడుకను జరిపించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ చిత్రం ఉత్తర తెలంగాణలో 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటించారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి సురేష్బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు.