మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన కరోనా కాలంలో విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలు థియేటర్స్కి వచ్చి ఈ సినిమా చూస్తారో లేదో అని భయం భయంగానే సినిమాను విడుదల చేశారు.కాని ప్రేక్షకులు ఉప్పెనలా వచ్చి ఎంతగానో ఆదరించారు . బాక్సాఫీస్ వద్ద 100కోట్ల క్లబ్ చిత్రంగా సంచలనం సృష్టించింది. దీంతో దేశంలోనే ఉత్తమ డెబ్యూ హీరోగా రికార్డులకెక్కాడు.
అయితే ఈ చిత్రానికి వైష్ణవ్ తేజ్ మొదటి ఎంపిక కాదనేది తెలిసింది తక్కువ మందికే. దర్శకుడు బుచ్చిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండని బేస్ చేసుకొని కథ రాసుకున్నట్టు తెలియజేశాడు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ రేంజ్ మారడంతో తన మనసు మార్చుకొని వైష్ణవ్ని సంప్రదించాడట బుచ్చి. అనూహ్యంగా ఉప్పెనతో తెరపైకి వచ్చిన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఈ సినిమాతో ఉత్తమ డెబ్యూ దర్శకుడిగా బుచ్చి బాబు సన.. ఉత్తమ డెబ్యూ నాయికగా కృతి శెట్టి పేర్లు మార్మోగాయి.