SSMB29 Latest Update | మహేష్ అభిమానులే కాదు, సినీ సెలబ్రెటీల సైతం ‘SSMB29’ కోసం ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్పైకి వెళ్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఉన్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో గ్లోబల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, వెండితెరపై మహేష్ను ఎలా చూపిస్తాడో అని క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో మహేష్ ప్రపంచం మొత్తం చుట్టేసే వాడిగా కనిపించనున్నట్లు జక్కన్న ఇదివరకే వెల్లడించాడు.
ఇటవలే రైటర్ కేవి. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ను బేస్ చేసుకొని తెరకెక్కుతుందని, ఇదొగ అడ్వేంచర్ చిత్రమని వెల్లడించాడు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక అప్డేట్ను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ సినిమాను ఫ్రాంచైజీగా డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ మూవీకి సీక్వెల్స్ వస్తాయిని, ఈ సీక్వెల్స్ కథ మారుతున్నప్పటికీ ప్రధాన పాత్రలు మాత్రం అలాగే ఉంటాయిని వెల్లడించాడు. ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తిచేసే పనిలో ఉన్నట్లు చెప్పాడు.
అంతేకాకుండా రాజమౌళి చాలా ఏళ్లుగా ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా తీయాలని అనుకుంటున్నాడని, కానీ ఇప్పటివరకు ఆ చాన్స్ రాలేదని చెప్పారు. ఈ సినిమాను రాజమౌళి హై లెవల్లో ప్లాన్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. దాంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడంతో రాజమౌళి ఈ సినిమాను గ్రాండ్ స్కేల్లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడట. కే.ఎల్నారాయణ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించనున్నాడట. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్లో ఏకకాలంలో తెరకెక్కిస్తారట. ఆ తర్వాత మిగితా భాషల్లో డబ్ చేస్తారట. మహేష్కు జోడీగా దీపికా పదుకొనేను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.