This Week Theater/OTT Release Movies | కొన్ని చోట్ల ‘ఆర్ఆర్ఆర్’ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. రీసెంట్గానే ఈ చిత్రం 1000కోట్ల క్లబ్లో చేరింది. ఇక భారీ అంచనాలతో గతవారం విడుదలైన ‘గని’, ‘ఆర్ఆర్ఆర్’కు ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. అంతేకాకుండా గని ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఆర్ఆర్ఆర్ ఒక్క రోజు కలెక్షన్లకు సమానంగా ఉన్నాయి. ఈ వారం రెండు పాన్ ఇండియా సినిమాలు పోటీ పడనున్నాయి. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఓటీటీలో ప్రేక్షకులను సందడి చేయడానికి పెద్ద సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలేంటో ఓ లుక్కేద్ధాం
బీస్ట్:
కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బీస్ట్’. ‘డాక్టర్’ ఫేం నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పై మొదటి నుంచి ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమా రెట్టింపు అంచనాలను నమోదు చేశాయి. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు సెల్వా రాఘవన్ కీలకపాత్రలో నటించాడు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
కేజీఎఫ్ చాప్టర్-2:
‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సౌత్ చిత్రం ‘కేజీఎఫ్’. ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల తుఫాన్ సృష్టించింది. ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కన్నడ ప్రేక్షకులతో సమానంగా ఇతర భాష ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చేస్తున్నారు. ప్రేక్షకుల నిరీక్షణకు ఫలితంగా ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. యష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ను సాధిస్తున్నాయి.
ఓటీటీ:
ఆడవాళ్ళు మీకు జోహార్లు:
శర్వానంద్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. ‘చిత్రలహరి’ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 4న విడుదలై మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 14 నుంచి సోని లివ్లో స్ట్రీమింగ్ కానుంది.
దహానం:
అభిషేక్ దుహన్, ఈషా కొప్పికర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దహనం’. రామ్గోపాల్ వర్మ సమర్ఫణలో అగస్థ్య మంజు దర్శకత్వం వహించాడు. హింసే మూలంగా రాసుకున్న ప్రతికార కథగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఏప్రిల్ 14న నేరుగా ఎమ్ఎక్స్ ప్లేయర్లో విడుదల కానుంది.
గాలివాన:
సాయికుమార్, రాధికా శరత్కుమార్, చాందిని చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాలివాన’. ఇద్దరు
భార్య, భర్తలు హత్యకు గురవుతారు. వాళ్ళని ఎవరు చంపారు ఎందుకు చంపారు అనే కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం జీ-5లో ఏప్రిల్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బ్లడీమేరీ:
విభిన్న కథలను ఎంచుకుంటూ తన శైలి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి నివేథా పేతురాజ్.ఈమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్లడీ మేరీ’. ‘కార్తికేయ’ ఫేం చందూ ముండేటీ దర్శకత్వం వహించిడు. లేటెస్ట్గా విడుదలైన ట్రైలర్ చిత్రంపై భారీ అంచనాలను పెంచింది. నివేథా పేతురాజ్ ఈ చిత్రంలో అంధురాలి పాత్రలో నటిస్తుంది. చిన్నప్పుడు తనకు జరిగిన అన్యాయానికి ఎలా ప్రతికారం తీసుకుంది అనే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 15న నేరుగా ఆహాలో విడుదల కానుంది.
వీటితో పాటుగా పునీత్ రాజ్కుమార్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ ఏప్రిల్ 14నుంచి సోని లివ్లో స్ట్రిమింగ్ కానుంది. ఇక అక్షయ్ కమార్ ‘బచ్చన్ పాండే’(హిందీ), ‘వెయిల్’(మలయాళం) చిత్రాలు అమేజాన్ ప్రైమ్లో ఏప్రిల్ 15 నుంచి స్ట్రీమింగ్ కాగ ‘నాయి శేఖర్’(తమిళం) సన్ ఎన్ఎక్స్టీలో స్ట్రీమింగ్ కానుంది.