తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ..సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఈ చిత్రం నుంచి ‘ప్రేమ..ప్రేమిస్తున్నా’ అనే గీతాన్ని విడుదల చేశారు.
భరత్ మంచిరాజు స్వరపరచిన ఈ పాటను పూర్ణాచారి రచించారు. జేమ్స్ టకారా ఆలపించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమిదని, కథానుగుణంగా సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఫీల్గుడ్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భరత్ మంచిరాజు, దర్శకత్వం: భరత్ దర్శన్.