Maanadu Movie Remake | పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉండే అతికొద్ది మంది నటులలో రానా దగ్గుబాటి ఒకడు. మొదటి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. కాగా విరాట పర్వం తర్వాత ఇప్పటివరకు రానా మరో సినిమా ఒప్పుకోలేదు. గతేడాది విడుదలైన ‘విరాటపర్వం’ బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్గా మిగిలింది. వసూళ్ళ సంగతి పక్కనపెడితే ఇలాంటి కథను ఒప్పుకున్న రానాను ఖచ్చితంగా మెచ్చుకోవాలి. హీరోయిన్ పాత్ర డామినేటెడ్ అని తెలిసిన రానా ఈ సినిమాను చేశాడు. ఇక ఇటీవలే రానానాయుడు వెబ్ సిరీస్తో కాస్త విమర్శలు ఎదుర్కొన్నా.. నార్త్ ఆడియెన్స్లో మాత్రం మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు.
ఇక రానా తన తదుపరి సినిమాను తేజ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోయాయని వినికిడి. ఎప్పుడు అని చెప్పలేం కానీ, వీలైనంత తొందరగానే ఈ ప్రాజెక్ట్ మొదలు కాబోతుంది. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే.. ఏడాది కాలంగా రానా మానాడు రీమేక్ చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. సురేష్ బాబు కూడా పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి రీమేక్ హక్కులను కూడా దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి మాట ముచ్చట వినిపించిందే లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా? లేదా? అనే క్లారిటీ కూడా లేదు.
కాగా తాజాగా ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మానాడు రీమేక్ ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది. అయితే మొదటగా బాలీవుడ్లో రీమేక్ చేయాలని సురేష్ ప్రొడక్షన్ సంస్థ ప్లాన్ చేస్తుందట. ఆ తర్వాతే హిందీలో డబ్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయ్యాయని సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. టైమ్ లూప్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు.