అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలకు ఈరోజు శుభం కార్డు పడుతుందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి అన్నారు. ఏపీ సీఎం జగన్తో చర్చించేందుకు హైదరాబాద్లోని బేగంపేట నుంచి విమానంలో చిరంజీవి విజయవాడకు బయలు దేరారు. చిరంజీవితో పాటు మహేశ్బాబు, జూనియర్, ఎన్టీఆర్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ఇతర సినీ ప్రముఖులు జగన్తో సమావేశం కానున్నారు. సీఎంతో అన్ని విషయాలు చర్చించిన తరువాత చర్చల అంశాలను వెళ్లడిస్తానని, ఈరోజుతో సమస్యకు ఎండ్ కాదు శుభం కార్డు పడుతుందని పేర్కొన్నారు.
గత కొన్ని నెలలుగా ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో పాటు ఇతర సినీ సమస్యలపై సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినీ పరిశ్రమ సమస్యలపై మంత్రి పేర్నినాని,సంబందిత అధికారులతో సీఎం జగన్ సమావేశమై చర్చించారు.