తాప్సీ అంటేనే కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్ అంటున్నారు బాలీవుడ్ జనాలు. గత కొన్నేళ్లుగా మహిళా ప్రధాన చిత్రాలు, సామాజిక అంశాల్ని స్పృశించే కథల్ని ఎంచుకొంటూ హిందీ చిత్రసీమలో ప్రత్యేకతను సృష్టించుకుంది. వృత్తిపట్ల బోర్గా ఫీలయిన రోజు ఏమీ సాధించలేమని, ప్రతిరోజు కొత్త మార్గాల్ని అన్వేషించినప్పుడే కెరీర్ ఉత్సాహంగా ఉంటుందని చెప్పింది తాప్సీ. ప్రస్తుతం ఎవరి సలహాలు అవసరం లేకుండానే సినిమాల విషయంలో స్వీయనిర్ణయాలు తీసుకుంటున్నానని ఆనందం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘నా వృత్తిని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నా. ఏ కథ పేరు తెచ్చిపెడుతుందో, ఏది కమర్షియల్గా వర్కవుట్ అవుతుందో అనే అంశాలపై చక్కటి స్పష్టత వచ్చింది. అందుకే షూటింగ్కు వెళ్లే ప్రతిరోజు ఉత్సాహంగా అనిపిస్తున్నది. మార్కెట్ లెక్కలు, ఇమేజ్ పట్టింపులు లేకుండా కెరీర్ను ఆస్వాదిస్తున్నా’ అని చెప్పుకొచ్చింది తాప్సీ. ఎప్పటికప్పుడు కొత్త జోనర్ కథాంశాల్ని ఎంచుకోవడం, పాత్రల్లో వైవిధ్యం చూపించడమే తన విజయ రహస్యమని ఆమె పేర్కొంది. ప్రస్తుతం తాప్సీ భారతీయ మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న ‘శభాష్ మిత్తు’ చిత్రంలో నటిస్తోంది.