‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో టాలెంటెడ్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు సాయిలు కంపాటి. ఆయన రెండో చిత్రం గురువారం సికింద్రాబాద్లోని గణేష్ ఆలయంలో ప్రారంభమైంది. సుమంత్ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై పూస్కూర్ రామ్మోహన్ రావు, భరత్నారంగ్ నిర్మిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి హీరో అడివి శేష్ క్లాప్నివ్వగా, ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కెమెరా స్విఛాన్ చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇదని, ఓ చిన్న పట్టణం నేపథ్యంలో కథ నడుస్తుందని, ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు లవ్స్టోరీ ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.